లేటెస్ట్

ఈ మాజీ మంత్రులు మాకొద్దు ‘బాబూ’...!

కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలో అధికార అండతో తమను ఎంతో ఇబ్బందులు పెట్టారు. పార్టీపట్ల విధేయతతోపాటు, చంద్రబాబు నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్న వారిని కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎవరెవరు అయితే అధికారంతో కావాలని స్థానిక నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారో, అటువంటి వారందరు గత ఎన్నికల్లో ఓడిపోయినా వారిలో కొందరిని నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇటీవల జరిగిన సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా తమను ఎన్ని విధాలుగా వారు ఇబ్బంది పెట్టారో..ఆధారాలతో చంద్రబాబు అధ్యక్షత జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. ఇంత ఘోరం అప్పట్లో జరుగుతుంటే నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని కొందరు నాయకులను ‘చంద్రబాబు’ ప్రశ్నించగా, మిమ్మలను కలిసే అవకాశం అప్పటి మీ అంతరంగిక అధికారులు ఇవ్వలేదు. మీరు కూడా మమ్ములను పట్టించుకోలేదు. అందుకే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని వారు అన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. అందుకు మూల్యం ఎవరెవరు చెల్లించుకోవాలో వారు చెల్లించుకున్నారు.


ఇప్పటికైనా మీరు కళ్లు తెరచి..అటువంటి నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను పదవుల నుంచి తప్పించి పలు నియోజకవర్గ నేతలు చంద్రబాబును కోరగా కొంత కాలం ఆగండి. స్థానిక నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను నియమిస్తానని చంద్రబాబు ఆ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. తాడికొండ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి జవహర్‌, మాజీ మంత్రి పుల్లారావు, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేల విషయం ‘చంద్రబాబు’కు అనుభవంతో కాని తెలిసిరాలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అహంకారంతో, మూర్ఖత్వంతో వ్యవహరించారని,కనిపించిన వారిని పలకరించకుండా వెళ్ళిపోయారని, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, పీతల సుజాత తదితరులను పదవులకు దూరం పెట్టాలని చంద్రబాబును స్థానిక నాయకులు కోరినట్లు తెలిసింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని పక్కన పెట్టి స్థానిక బీసీ నేతను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించాలని స్థానిక నాయకులు కోరారు. అదే విధంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిల ప్రియలకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దని చంద్రబాబును స్థానిక నేతలు కోరుతున్నారు. దీనిపై ‘చంద్రబాబు’ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ