'లక్ష్మీపార్వతి'ని 'జగన్' మర్చిపోయారా...!?

వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత...ఆయనను నమ్ముకున్న వారందరికీ ఆగ మేఘాలపై పదవులు దక్కాయి. కష్టమైనా, నష్టమైనా ఆయన వెంట నడిచిన వారిలో చాలా మందికి వివిధ పదవులు దక్కాయి. ఆయన కార్యాలయంలో పనిచేసినవారికి కూడా వారు ఊహించిన విధంగా పదవులు వచ్చాయి. చివరికి..సినిమా నటుడు పృధ్వికి కూడా పోస్టు దక్కింది. కానీ..'జగన్' ముఖ్యమంత్రి అవడం కోసం..ఎంతో కష్టపడ్డ..'నందమూరి లక్ష్మీపార్వతి'కి మాత్రం ఇంకా ఏ పదవీ దక్కలేదు. 'జగన్' గెలిచిన తరువాత...ఆమె గురించి..వార్తా పత్రికల్లో ఎక్కడా కనిపించడం లేదు...వినిపించడం లేదు. 'జగన్' ముఖ్యమంత్రి అయితే తనకు మంచి పదవి ఇస్తాడన్న ఆశతో...ఆయన నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్లో 'లక్ష్మీపార్వతి' పాల్గనేది. ఆయన నిర్వహించిన దీక్షల్లో తన అల్లుడు 'చంద్రబాబు'ను దూషిస్తూ...ఎన్టీఆర్ అభిమానులు..'జగన్'కు మద్దతు ఇవ్వాలని కోరేది. ఆమె కోరుకున్న చందాన...'జగన్' ముఖ్యమంత్రి అయ్యారు. కానీ..లక్ష్మీపార్వతికి మాత్రం..ఎటువంటి పదవి దక్కలేదు.
'జగన్' ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన వారందరికీ ముందుగానే బెర్త్లు దక్కగా...'లక్ష్మీపార్వతి' మాత్రం నిరాదరణకు గురైంది. ఎన్నికలకు ముందు...'కోటి' అనే అతని విషయంలో జరిగిన వివాదం తరువాత..ఆమె ఎక్కడా పెద్దగా కనిపించలేదు. 'జగన్' అధికారంలోకి వచ్చిన తరువాత తన పరువు తీసిన 'కోటి'పై చర్యలు తీసుకోవాలని 'లక్ష్మీపార్వతి' కోరడం, ఆ వెంటనే 'కోటి' బిజెపిలో చేరడంతో..అంతా గప్చుప్ అయిపోయింది. కాగా..'కోటి' విషయం పక్కన పెట్టినా...'జగన్' కోసంఎంతో కష్టపడ్డ.. 'లక్ష్మీపార్వతి'కి ఏదైనా మంచి పోస్టు దక్కుతుందని ఆమె సన్నిహితులు భావిస్తుండగా...అధికార పార్టీలో మాత్రం ఎక్కడా అటువంటి ఛాయలు కనిపించడం లేదు. మరి కొన్నాళ్ల తరువాత... ఏమైనా కదిలిక వస్తుందేమో చూడాలి మరి.