నిజాయితీ, కృషి వున్న వ్యక్తులే అవినీతి నిర్మూలనలో ఆదర్శవంతగా నిలుస్తారు:మాజీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
సమాజంలోని అవినీతి నిర్మూలనకు, అలాగే దేశాభివృద్ధికి జీవితంలో నిజాయితీ, కఠోర శ్రమ, వినయం ఉన్న వ్యక్తులు ఆదర్శంగా నిలుస్తారని మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎల్.నరసింహారెడ్డి అన్నారు . దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు-2022 ప్రారంభ రోజు కార్యక్రమంలో పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎల్. నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మ కుమారి సునీత గౌరవ అతిథిగా పాల్గొనగా మరియు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీమతి చంద్రిమా రాయ్ గారు ఈ సభకు అధ్యక్షత వహించారు.
"విజిలెన్స్ అవేర్నెస్ వీక్ - 2022" ఈరోజు అనగా తేదీ 31 అక్టోబర్ 2022న సికింద్రాబాద్లోని రైల్ నిలయం ఆడిటోరియంలో జరిగింది. "విజిలెన్స్ అవేర్నెస్ వీక్ - 2022"ని దక్షిణ మధ్య రైల్వే 31 అక్టోబర్ నుండి నవంబర్ 6, 2022 వరకు పాటిస్తోంది. ప్రస్తుత సంవత్సరం నేపథ్యం "అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతదేశం".
ఈ సందర్భంగా శ్రీ ఎల్.నరసింహారెడ్డి మాట్లాడుతూ అవినీతిని పారద్రోలాలంటే బలమైన సంకల్ప శక్తి ఒక్కటే పరిష్కారమని అన్నారు. నిజం చెప్పాలంటే, అవసరం మరియు దురాశ మధ్య తేడాను గుర్తించగలగాలిఅని అన్నారు . నిజాయితీ మరియు కష్టపడి పని చేయడం వల్ల మన దేశాన్ని అవినీతి రహిత మరియు అభివృద్ధి చెందిన దేశం వైపు నడిపిస్తుందని తెలిపారు . ప్రతి వ్యక్తి సహజ స్వభావంతో ప్రాథమికంగా నిజాయితీపరుడని, అయితే సంపద మరియు వనరులను బహిర్గతం చేసినప్పుడు, స్వార్థం మరియు దురాశ కారణంగా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు . నవ భారతాన్ని నిర్మించేందుకు అవినీతి నిర్మూలనకు ప్రతి వ్యక్తి స్పృహతో కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు అనగా , దేశాన్ని ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించిన శ్రీ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అదే స్మారకార్థం గుర్తుగా శ్రీ ఎల్.నరసింహారెడ్డి సమావేశానికి హాజరైన అధికారులు మరియు సిబ్బందితో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మ కుమారి సునీత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక పథం యొక్క ప్రాముఖ్యతను గురించి మరియు ఈ రోజు సమాజంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు, ముఖ్యంగా అవినీతిని నిర్మూలించడానికి ఇది ఎలా పరిష్కారాన్ని రుజువు చేస్తుందో వీక్షకులకు అవగాహన కల్పించారు. ప్రతి ఆత్మ తన ధర్మం ద్వారా దైవం పవిత్రంగా ఉంటుందని, అయితే దానిని అలాగే ఉంచడానికి, క్రమమైన మరియు నిరంతర ఆధ్యాత్మిక ఆధారిత జీవన విధానం అవసరమని ఆమె అన్నారు. తమ స్థానాన్ని , స్వాధీనమైనా ఎలాంటి భౌతిక /వస్తు సంబంధమైన అనుబంధాల వైపు ఆకర్షితులు కావొద్దని ఆమె గుర్తు చేసారు .
ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి చంద్రిమా రాయ్ అధ్యక్షత వహించారు. శ్రీమతి చంద్రిమా రాయ్ తన స్వాగత ప్రసంగంలో మాట్లాడుతూ చీఫ్ విజిలెన్స్ కమిషన్ /రైల్వే బోర్డు దిశా నిర్దేశం మేరకు నిర్వహిస్తున్న నిఘా అవగహన వరం యొక్క విధానాలను గూర్చి ఆమె వివరించారు . ఈ నిఘా అవగహన వారం కార్యక్రమంలో భాగంగా రైల్వే పాఠశాలలు/కళాశాలల్లోనే కాకుండా ఇతర పాఠశాలలు/కళాశాలల్లో కూడా వక్తృత్వ మరియు వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు . ఇందులో మొత్తం 700 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఇందులో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ బులెటిన్ను శ్రీ ఎల్. నరసింహా రెడ్డి విడుదల చేశారు. అవినీతి దుష్ఫలితాలను ఎత్తిచూపుతూ అంతర్గత కళాకారులు ఆడిన స్కిట్తో అందరిని ఎంతో ఆకట్టుకుంది .