వందేభారత్ ఎక్స్ప్రెస్కు విశేష స్పందన
భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు - వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి తేదీన సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టబడింది .ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల నుండి ఉత్సాహభరితమైన స్పందనను చూరగొంది . ఈ రైలు నాలుగు మధ్యంత స్టేషన్ లు అనగా వరంగల్, ఖమ్మం, విజయవాడ మరియు రాజమండ్రి నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. ఈ మధ్యంతర స్టేషన్లలో కూడా ఈ రైలుకు ఎంతో ఆదరణ మరియు స్పందన ఎంతో ఆశాజనకంగా వుంది. తెలంగాణలో వరంగల్ చాలా ముఖ్యమైన నగరం మరియు పగటిపూట ఈ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మంచి ప్రయాణ అవకాశం లభించింది. గత నెల వ్యవధిలో వరంగల్ నుంచి సికింద్రాబాద్కు 704 మంది ప్రయాణికులు ప్రయాణించగా , ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు మరో 2,211 మంది ప్రయాణికులు ప్రయాణించారు. మరోవైపు విశాఖపట్నం వైపు నుంచి 1,806 మంది ప్రయాణికులు వరంగల్కు ప్రయాణించగా , మరో 2,046 మంది సికింద్రాబాద్ నుంచి వరంగల్కు రాకపోకలు సాగించారు. మరో మాటలో చెప్పాలంటే, వరంగల్ స్టేషన్ నుండి ప్రతిరోజూ సగటున 101 మంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు , మరో 133 మంది ప్రయాణికులు వరంగల్ స్టేషన్లో ప్రతిరోజూ ఈ రైలు ద్వారా దిగుతున్నారు . ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు ప్రయాణీకుల నుండి విశేషమైన ఆదరణ పొందింది .ఇరువైపులా రెండు మార్గాల నుండి పూర్తి స్థాయిలో ప్రయాణికుల సామర్థ్యంతో నడుస్తోంది. 16 జనవరి 2023 నుండి, ఈ రైలు సేవను ప్రవేశపెట్టినప్పటి నుండి రైలు రెండు దిశలలో దాదాపు 140% సగటు ఆక్యుపెన్సీ (ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం ) తో నడుస్తోంది. వరంగల్ నుండి రైలు ప్రయాణీకులు కూడా ఈ సెమీ-హై స్పీడ్ రైలులో ప్రయాణించడానికి అధిక ఆసక్తిని కనబడుతున్నారు .ప్రయాణీకుల నుండి అందిన స్పందన చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ. అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, వందే భారత్ ఎక్స్ప్రెస్ అందిస్తున్న వేగం మరియు సౌకర్యాన్ని బట్టి, ఈ రైలు వరంగల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల రైలు ప్రయాణీకుల కోసం ఇష్టపడే రైలు సర్వీస్లలో ఒకటిగా నిరూపించబడింది. .ఈ వందే భారత్ ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్గి వుంది . ప్రయాణీకుల ఆకాంక్షలను తీర్చగలిగింది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ విశిష్టతలు ::
• ప్రయాణాన్ని మరింత సౌలభ్యముగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి ఆధునిక సౌకర్యాలతో సమకూర్చబడింది . అమర్చబడింది.
•జి పి ఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థతో (ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ) ప్రారంభించబడింది మరియు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లను కలిగి ఉంది.
• ప్రతి కోచ్లో రిక్లైనర్ సీట్లు. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో సీట్లు ( 180 డిగ్రీలో ) తిరిగే అదనపు సౌకర్యం
• ప్రతి కోచ్లో ఎమర్జెన్సీ అలారం బటన్ మరియు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లు.
• సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణం కోసం అన్ని కోచ్లలో సి సి టి వి కెమెరాలను అమర్చారు. అదనంగా, కోచ్ల వెలుపల ప్లాట్ఫారమ్ వైపు కూడా కెమెరాలు ఏర్పాటు చేసారు .
• అన్ని కోచ్ల మధ్య రాకపోకలకు సులభతరంగా ఉండేందుకు మూసివేసిన గ్యాంగ్వేలతో ఏర్పాటు
• అన్ని ఎలక్ట్రికల్ క్యూబికల్స్ మరియు టాయిలెట్లలో మెరుగైన అగ్ని మాపక భద్రత ప్రమాణాలు.
• టచ్ ఫ్రీ సౌకర్యాలతో ఆధునిక బయో-వాక్యూమ్ టాయిలెట్లు.
• ప్రయాణీకుల సమాచారం మరియు ఇన్ఫోటైన్మెంట్ను వ్యాప్తి చేయడానికి ప్రతి కోచ్లో పెద్ద సైజు (32").
డిస్ప్లే యూనిట్లు
• ప్రతి కోచ్లో నాలుగు అత్యవసర విండోలు అమర్చబడి ఉంటాయి.
• ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ. "కవచ్" యొక్క అధునాతన భద్రత అమర్చబడింది .
వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయోజనాలు-
• వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన పగటి పూట ప్రయాణ సౌకర్యం
• మొట్టమొదటిసారిగా ఆకర్షవంతంగా రూపొందించబడిన మరియు పూర్తిగా ఏ సి సర్వీస్
• రైలు వినియోగదారులకు మెరుగైన అనుభూతితో కూడిన ప్రయాణ సౌకర్యం.
• ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు పగటి వేళ నడుస్తుంది.
• ఇతర రవాణా మార్గాలతో ప్రయాణ సమయాన్నిపోల్చితే ఇది అతి తక్కువ ప్రయాణ సమయం.