లేటెస్ట్

చంద్రబాబు సమీక్షలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు పాల్గొనాలి

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 24వ తేదీ ఏలూరుదగ్గర చోధిమెళ్ళ వద్ద నిర్వహించనున్న టిడిపి జోన్-2 సమీక్ష సమావేశమునకు భీమవరం నియోజకవర్గంలోని టిడిపి క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జీలు తప్పనిసరిగా పాల్గొనాలని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ భీమవరం పట్టణ కన్వీనర్ వెండ్ర శ్రీనివాస్ కోరారు.భీమవరం పట్టణ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన క్లస్టర్ ఇంచార్జ్ సమావేశంలో మాట్లాడుతూ  చంద్రబాబు నిర్వహించనున్న సమీక్ష సమావేశమునకు 24వ తేదీ ఉదయం 7 గంటలకు భీమవరం తెలుగుదేశంపార్టీ కార్యాలయంవద్ద నుండి క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో బయలదేరనున్నామని తెలుపుతూ గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడిచేసిన వైసీపీ గూండాలపై కేసులు నమోదు చేయకపోగా టిడిపి నాయకులు పట్టాభిపై హత్యనేరంకేసు నమోదుచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు.నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ టిడిపి జోన్-2 ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరిజిల్లాల చంద్రబాబు సమీక్ష సమావేశంలో రాష్ట్ర పార్టీ రూపొందించిన ప్రతినిధుల జాబితా ప్రకారమే సమీక్ష నిర్వహిస్తారని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు  తప్పనిసరిగా ఈసమీక్షలో పాల్గొనాలని  పిలుపునిస్తూ సమీక్ష సమావేశమునకు సంబంధించిన పాసులను క్లస్టర్ ఇంచార్జ్ లకు అందజేశారు.ఈసమావేశంలో భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేపు వెంకన్న కౌరు పృథ్విశంకర్ వీరవాసర మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జులు మెరగాని నారాయణమ్మ ఎరకరాజు గోపాలకృష్ణరాజు వీరవల్లి చంద్రశేఖర్ పాల శ్రీరామదాసు మెంటే గోపి ఎండి నౌషాద్ యద్దు ఏసుపాదం భూపతిరాజు బుజ్జిరాజు పామర్తి వెంకటరామయ్య బొడ్డు మోహన్ కొట్టు బాబులు తదితర నాయకులు పాల్గొన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ