లేటెస్ట్

‘ఉత్తరాంధ్ర’లో ‘వైకాపా’కు వచ్చేది ఎనిమిది సీట్లేనట..!?

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ‘ఆంధ్రప్రదేశ్‌’లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఎంత ఓటింగ్‌ వస్తుందో..ముందుగానో అంచనాలు వేస్తున్నాయి. ఇప్పటికే రాజకీయపార్టీలు తమ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి సర్వేలు చేయించుకుంటున్నాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, మరో పార్టీ అయిన ‘జనసేన’లు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైకాపా అన్ని పార్టీలకంటే ఈ విషయంలో ముందుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే చేయించుకుంటోంది. ఆ పార్టీకి ఎన్నికల సలహాలను అందిస్తున్న ఐప్యాక్‌ టీమ్‌ ద్వారా సర్వే చేయిస్తోంది. అయితే ఇటీవల ఐప్యాక్‌ టీమ్‌ చేసిన సర్వే వైకాపా పెద్దలకు మింగుడుపడడం లేదట. ఆ సర్వేలో అధికార పార్టీ ఓడిపోతుందని తేలిందట. ఓటమిలో కూడా ఘోర ఓటమి తప్పదని తేలిందట. ఇదొక్కటే కాదు..‘ఆంధ్రా’కు నూతన రాజధాని అని చెబుతోన్న ‘ఉత్తరాంధ్ర’లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని సర్వే తేల్చిందని చెబుతున్నారు. ‘ఉత్తరాంధ్ర’లో ఆ పార్టీకి ఎనిమిదికి మించి సీట్లు రావని తేలిందట. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది సీట్లు ఉంటే ఇక్కడ అధికార వైకాపాకు కేవలం ఒక్క సీటు మాత్రమే వస్తుందట. అదీ ఎస్టీ నియోజకవర్గమైన పాలకొండ అట.  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని తేలిందట. విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లు ఉంటే వీటిలో అధికార వైకాపాకు మూడు వస్తాయట. గజపతినగరం, శృంగవరపుకోట మరియు పార్వతీపురం అధికారపార్టీ ఖాతాలోకి వెళతాయట. మిగిలిన ఆరులో ఐదు సీట్లు టిడిపికి రానున్నాయని తేలింది. మరో నియోజకవర్గమైన సాలూరులో టిడిపికి స్వల్ప మెజార్టీ వస్తుందని తేలింది. విశాఖపట్నంలో ‘టిడిపి’ పూర్తి మెజార్టీతో ఉందట. ఎస్టీ నియోజకవర్గాలైన ‘అరకు, పాడేరు’ మరియు పెందుర్తి, పాయకరావుపేట’ నియోజకవర్గాల్లో అధికారపార్టీకి మెజార్టీ వస్తుందని, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టిడిపి గెలుస్తుందని సర్వే తేల్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 15 సీట్లలో టిడిపి కేవలం నాలుగు సీట్లు మాత్రమే నెగ్గింది. అదీ విశాఖపట్నం నగర ప్రాంతాల్లోనే. అయితే ఈసారి పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయిందని మొత్తం 34 సీట్లు ఉన్న ఉత్తరాంధ్రలో అధికార వైకాపాకు కేవలం 8 సీట్లు మాత్రమే వస్తాయని, మిగతావన్నీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంటుందని,అదీ జనసేన పొత్తులేకుండానే సాధిస్తుందట. ఒకవేళ టిడిపి, జనసేన పొత్తుపెట్టుకుంటే టిడిపి అభ్యర్థుల మెజార్టీలు భారీగా పెరుగుతాయని, అదే సమయంలో అధికారపార్టీకి వస్తాయనుకున్న ఎనిమిది సీట్లు కూడా రావని సర్వే తేల్చిందట. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ