లేటెస్ట్

‘టిడిపి’ గాలానికి ‘వంశీ’ చిక్కారా..లేక..స్వయంకృతమా...!?

‘గన్నవరం’ మాజీ ఎమ్మెల్యే ‘వల్లభనేని వంశీమోహన్‌’ను ‘విజయవాడ’ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆయన అరెస్టు వైకాపాలో కలకలం సృష్టిస్తుండగా, ‘టిడిపి’ శ్రేణులు, కార్యకర్తలు, సానుభూతిపరులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ‘వంశీ’ చేసిన అరాచకాన్ని గుర్తు చేసుకుని వారు ఇన్నాళ్లకు ‘వంశీ’ పాపం బద్దలైందని సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనను ఎప్పుడో అరెస్టు చేయాల్సిందని, ఇన్నాళ్లు వేచిచూశారని, ఆలస్యం అయినా అరెస్టు చేసినందుకు వారు పార్టీ అధినేత ‘చంద్రబాబు’ను, ఆయన కుమారుడు ‘లోకేష్‌’ను అభినందిస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వంశీ’ని అరెస్టు చేస్తారని ‘టిడిపి’ శ్రేణులు భావించాయి. అలా భావించడానికి ప్రధాన కారణం ఆయన గతంలో టిడిపి అధినేత ‘చంద్రబాబు’ను ఆయన సతీమణి ‘భువనేశ్వరి’ని ఆయన కుమారుడు ‘లోకేష్‌’ను ఉద్దేశించిన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలే కారణం. ముఖ్యంగా ‘భువనేశ్వరి’ క్యారెక్టర్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరూ క్షమించలేనివి. అయితే..‘వంశీ’ ఎంత అసభ్యకరంగా, అనాగరికంగా మాట్లాడినా..‘చంద్రబాబు’, ‘లోకేష్‌’లు ఆయనపై ప్రతీకారానికి వెళ్లలేదు. అయితే ‘గన్నవరం’ ‘టిడిపి’ కార్యాలయంపై దాడి కేసులో మాత్రమే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ‘వంశీ’కి ముందస్తు బెయిల్‌ లభించింది. దీంతో..ఇక తనను అరెస్టు చేయరని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడరని ‘వంశీ’ భావించి..తన పాత రాజకీయాలను తెరమీదకు తెచ్చారు. దీనిలో భాగంగా ‘గన్నవరం’ ‘టిడిపి’ కార్యాలయ కేసులో ఫిర్యాదు ఇచ్చిన ‘సత్యవర్థన్‌’ అనే వ్యక్తిని లోబరుచుకుని..పోలీసులకు వ్యతిరేకంగా ఆయనతో అఫడవిట్‌ దాఖలు చేయించారు. దీంతో..ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురైంది.


తాము ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగకపోయినా..తమను చేతకానివాళ్లని భావించే కేసులో ముఖ్యమైన వ్యక్తిని సొమ్ములతో లోబరుచుకుంటారా..? అంత చేతకానివాళ్లమా... అంటూ ప్రభుత్వ పెద్దలు ఆగ్రావేశాలకు గురయ్యారు.దీంతో..‘వంశీ’ ఎక్కడ ఉన్నా..వెంటనే అరెస్టు చేయాలనే ఆదేశాలు వెళ్లాయి. మామూలుగా చెబితే..ఇలాంటి వాళ్లకు అర్థం కాదనే భావన ప్రభుత్వ పెద్దలకు వచ్చినట్లైంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అందుకున్న పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకుని ‘వంశీ’ని పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు. అయితే..ఇదంతా ‘టిడిపి’ పన్నిన పన్నాగమే..అనే భావన కొందరిలో వ్యక్తం అవుతోంది. ముందుగా ‘సత్యవర్థన్‌’తో కేసు ఉపసంహరించుకున్నట్లు నాటకం ఆడిరచారని, ‘వంశీ’తో ఆయన టచ్‌లోకి వెళ్లడం వ్యూహాత్మకంగానే జరిగిందంటున్నారు. ‘టిడిపి’ పన్నిన ఉచ్చులోకి ‘వంశీ’ నేరుగా వచ్చేశారని, కోర్టు వద్దకు ‘వంశీ’ని రప్పించి..ఆయనతో ‘సత్యవర్థన్‌’కు రూ.10లక్షలు సొమ్ములు ఇప్పించడం..ఆ డబ్బు తీసుకుని ‘సత్యవర్ధన్‌’ ‘విశాఖ’కు చేరుకోవడం..అంతా ‘టిడిపి’ ప్లాననే కొందరు చెబుతున్నారు. తాము పన్నిన వలలోకి ‘వంశీ’ వచ్చిన తరువాత..సీసీ కెమెరాలతో చిత్రీకరించి, సొమ్ములకు సంబంధించిన ఆధారాలను రెడీ చేసుకుని, ఇక ‘వంశీ’ని లేవకుండా దెబ్బకొట్టగలమని అంచనాకు వచ్చిన తరువాతే అరెస్టు చేశారని ‘టిడిపి’కి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ‘వంశీ’ ఈ కేసులో ప్రధానమైన వ్యక్తికి సొమ్ములు ఎలా ముట్టచెప్పాడో.. అతనిని ఎక్కడెక్కడ కలిశాడో అన్న వివరాలన్నీ పోలీసుల వద్ద ఉన్నాయి. దీంతో..ఇప్పుడు కోర్టు కూడా ఆయనకు బెయిల్‌ ఇచ్చే పరిస్థితి ఉండదని వారు అంటున్నారు. కాగా..‘వంశీ’ తొందరపాటు తనం వల్లే ఇలా జరిగిందని వైకాపా వర్గాలు అంటున్నాయి. తనపై నిఘా ఉందని, తనను ఏ నిమిషంలోనైనా అరెస్టు చేస్తారని తెలుస్తున్నప్పుడు..కేసులో ప్రధానమైన వ్యక్తితో ‘వంశీ’ ఎలా తిరిగాడని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇంత హఠాత్తుగా కేసును నిర్వీర్యం చేస్తే..అధికారంలో ఉన్నవాడు చూస్తా ఉంటాడా..? వాళ్లలో కసిలేకపోయినా కోర్టుల సాక్షిగా ఫిర్యాదు దారును మేనేజ్‌ చేస్తుంటే చేతులు కట్టేసుకుంటారా..? ఈ మాత్రం ‘వంశీ’కి తెలియదా..? ఎవరు ఆయనకు సలహాఇచ్చారో...కానీ..ఆ సలహావల్ల ‘వంశీ’ తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కూడా వారు చెబుతున్నారు. మొత్తం మీద..టిడిపి పన్నిన వలలో ‘వంశీ’ చిక్కారా..లేక తన స్వయంకృతంలో చేసిన తప్పుల వల్ల దొరికారా..? అనేది పక్కన పెడితే..వ్యూహాత్మకంగా చేసిన తప్పులు ఆయనను కోలుకోలేని దెబ్బకొట్టాయని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వల్ల ఆయనకు ప్రజల నుంచి సానుభూతి కూడా లభించదు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ