లేటెస్ట్

పికె వ‌ర్సెస్ ఆత్మ‌సాక్షి స‌ర్వే...!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైకాపా పార్టీ ఘోరంగా ఓడిపోతుంద‌ని ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ పేర్కొన‌డం వైకాపా వ‌ర్గాల‌ను దిగ్ర్బాంతికి గురిచేసింది. జ‌గ‌న్ పార్టీకి సింగిల్ డిజిట్ రావ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని, ఆయ‌న ఐదేళ్ల పాల‌న ఆట‌వికంగా ఉంద‌ని, ఇటువంటి పాల‌న‌ను ఎవ‌రూ అంగీక‌రించ‌ర‌ని ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ నిర్వ‌హించిన స‌ద‌స్సులో ప్ర‌శాంత్ కిషోర్ పేర్కొన‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఓడిపోతార‌నే భావ‌న రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌క్తం అవుతున్నా...కొంత‌మందిలో ఏమూలో సందేహం..జ‌గ‌న్ వెనుక ఓ శక్తి ఉంద‌ని, ఆ శ‌క్తి ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌నే గెలుస్తార‌ని, వారితో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం కానీ, లేక వ్యాపార లావాదేవీలు కానీ..లేక మ‌రేదో బంధం కానీ..ఆ శ‌క్తి జ‌గ‌న్‌ను ఓడించ‌నీయ‌కుండా అడ్డుకుంటుంద‌నే ఆందోళ‌న చాలా మంది జ‌గ‌న్ వ్య‌తిరేకుల్లో ఉంది. అయితే..ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపుకు కార‌ణ‌మైన ప్ర‌శాంత్ కిషోర్ జ‌గ‌న్ ఓట‌మి త‌ధ్య‌మ‌ని, అదీ ఘోరంగా ఓడిపోతార‌ని చెప్ప‌డం..జ‌గ‌న్ పార్టీలో తీవ్ర‌మైన ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. నిన్న‌టి దాకా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ 175/175 అంటే..వాళ్లూ న‌మ్మ‌లేదు..అన్ని రాక‌పోయినా..మ‌రోసారి క‌నీసం 80 నుంచి 90 వ‌ర‌కు అయినా వ‌స్తాయ‌ని, అధికారానికి అవ‌స‌ర‌మైన వ‌చ్చినా రాక‌పోయినా..క‌నీన సీట్లు అయిన 80 వ‌స్తే..ఏదో విధంగా బిజెపి పెద్ద‌ల స‌హ‌కారంతో..అధికారాని వస్తామ‌ని భావిస్త‌న్న వైకాపా నాయ‌కుల‌కు..ప్ర‌శాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్య‌లు వారిలో తీవ్ర‌మైన ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది.


అస‌లే పోటీ చేయ‌డానికి అభ్య‌ర్ధులు దొర‌క‌ని ప‌రిస్థితుల్లో పోలింగ్‌కు ముందే..కాడిప‌డేసే ప‌రిస్థితి నెల‌కొన‌డంతో..ఏదోక‌టి చేసి..మ‌ళ్లీ తామే గెలుస్తున్నామ‌నే భ‌రోసాను ఇవ్వ‌డానికి ఆత్మ‌సాక్షి గ్రూప్‌ను వైకాపా పెద్ద‌లు రంగంలోకి దించారు. పైన పేర్కొన్న విధంగానే..వైకాపాకు 90 సీట్లు వ‌స్తాయ‌ని ఆత్మ‌సాక్షి ఓ స‌ర్వేను వ‌దిలింది. దీన్ని చూపించుకుని సోష‌ల్ మీడియాలో వైకాపా ఎర్న‌లిస్టులు, మేధావుల‌ని చెప్పుకునే పెద్ద‌లు రంగంలోకి దిగి..ఇంకేముంది...వైకాపానే మ‌ళ్లీ గెలుస్తుంద‌ని ఊద‌ర‌గొట్ట‌డం మొద‌లుపెట్టారు. నిన్న మొన్న‌టి దాకా..మ‌హోగ్ర‌మైన ఉద్య‌మం చేసిన అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లంతా కూడా వైకాపా వెంటే ఉన్నార‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంటుందంటే..ఆ స‌ర్వే ఎంత బూట‌క‌మో..ఇట్టే చెప్ప‌వ‌చ్చు..యువ‌త‌,ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు కూడా వైకాపా వెంటే ఉన్నార‌ట‌. వీళ్లే కాదు..స‌మాజంలో ఉన్న చాలా వ‌ర్గాలు..వైకాపా వెంటే ఉన్నాయ‌ని స‌ద‌రు స‌ర్వేఊద‌ర‌గొట్టింది. మొన్న‌టి దాకా..టైమ్స్‌నౌ అనే ఆంగ్ల‌ఛానెల్ వాడు 25\25 సీట్లు వైకాపా వ‌స్తాయ‌ని ఊద‌ర‌గొడితే..ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఆఖ‌రి ఛాన్స్‌గా ఇప్పుడు ఆత్మ‌సాక్షిని రంగంలోకి దింపారు. దీన్ని ప‌ట్టుకుని, తెల‌క‌ప‌ల్లి, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌, ఎర్న‌లిస్టు సాయి, వైఎన్నార్‌, కెఎస్ ప్ర‌సాద్ వంటి వైకాపా జ‌ర్న‌లిస్టులు\మేధావుల‌ని చెప్ప‌బ‌డే వారు సోష‌ల్ మీడియాలో వేస్తోన్న వీరంగాలు అంతా ఇందా కాదు. అయితే..వీరు ఎన్ని వేషాలు వేసినా, ఎంత ఊద‌ర‌గొట్టాల‌ని చూసినా..ఆంధ్రాలో ఉండి గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌ను అనుభవించిన వారు మాత్రం ప్యాలెస్ పాల‌న వ‌ద్ద‌నే అంటున్నారు. ఇప్పుడు వీరు చెబుతోన్న స‌ర్వే..ప్ర‌శాంత్ కిషోర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గానే వైకాపా పెద్ద‌లు తెచ్చార‌ని..ఏ కొద్దిగా రాజ‌కీయ ప‌రిజ్ఞానం  ఉన్న ఎవ‌రికైనా అర్థం అవుతుంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ