సింధుకు కాంస్యం
తెలుగుతేజం పి.వి.సింధు టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం సాధించింది. ఆదివారం నాడు జరిగిన ఉమెన్స్ సింగిల్స్ చైనాకు చెందిన బింగిజాయ్ పై 21-13,21-15తో వరుస సెట్లల్లో విజయం సాధించింది. సింధుకు ఒలంపిక్స్ లో రెండో పతకం. గత రియో ఒలంపిక్స్ లో ఆమె రజితం సాధించింది. నిన్న జరిగిన సెమీఫైనల్ లో చైనాకు చెందిన తాయ్ పై ఓడిపోయిన సింధు నేడు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆది నుంచి దూకుడుగా ఆడి కాంస్యం సాధించింది.