ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలి:హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని హైకోర్టు ఆదేశించి 'కరోనా' పరిస్థితులపై ఆ ముగ్గురు అధికారులతో ఎస్ఈసీ చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఎస్ఈసీ ఎన్నికలను నిర్వహించాలని ఆదేశిస్తే ప్రభుత్వం సహకరించాలంది. అధికారుల బృందంతో చర్చించిన అంశాలను తెలపాలని, ఈ నెల 29న తుది నిర్ణయం దీనిపై తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.