పోలీసుల తీరుమారదా...!?
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా...కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. వారిలో ఇంకా గత ప్రభుత్వ వాసనలు పోలేదు. పోలీసుస్టేషన్కు వచ్చిన పౌరులను దూషించడం,ఇష్టారాజ్యంగా తిట్టడం, కొట్టడం వారికి పరిపాటి అయింది. ఎటువంటి రాజకీయ,పలుకుబడిలేని, ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి వెళ్లాలంటే జంకుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వెళితే వారి చేతిలో ఎన్ని అవమానాలు పాలుకావాల్సి వస్తుందోనన్న శంకతో బిక్కుబిక్కుమంటున్నారు. అన్యాయానికి, అక్రమానికో గురైన వ్యక్తి పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే వణికిపోతున్నారు. ఒకవైపు తన జరిగిన అన్యాయంతో భీతిల్లుతుంటే..మరోవైపు పోలీసులు అనేమాటలకు బిక్కచచ్చిపోతున్నారు. దీంతో కొందరు తమకు ఎంత అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కడానికే ఇష్టపడడంలేదు. తమకు జరిగిన అన్యాయానికి లోనలోన కుల్లిపోతున్నారు. గత ప్రభుత్వహయాంలో ఎంత అన్యాయం జరిగినా అప్పటి కీచక ప్రభుత్వం పట్టించుకోదనే భావనతో సామాన్యులు మౌనాన్నే ఆశ్రయించారు. అయితే ఇటువంటి పరిస్థితులు మారాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రికావాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రజలందరూ ఒకేతాటిపైకి వచ్చి ఆయనను గెలిపించుకున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిందని, పోయిన స్వేచ్ఛవచ్చిందని భావించారు. అయితే..గతం తాలుకా చెత్తంతా వివిధ రూపాల్లో తిష్టేసుకోవడంతో..సామాన్యులకు మళ్లీ అవమానాలు పాలవుతున్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్లలకు వెళితే సామాన్యులకు అవమానాలే గతి. గతంలో జరిగిందే..ఇప్పుడూ జరుగుతోంది. పోలీస్ వ్యవస్థలో మార్పుతీసుకువస్తానని, పోలీసుల్లో మార్పులు తెస్తామని నూతనంగా రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత ఇటీవల చెప్పారు. పోలీసుల్లో మార్పు రాకపోతే వారిని మార్చివేస్తానని ప్రకటించారు. బాధ్యతగా వ్యవహరించాలని, సామాన్యులను ఇబ్బందులు పెట్టవద్దని,అసాంఘికశక్తులను, అక్రమార్కులను అణిచివేయాలని, మహిళలు, బాలికలపై దాడులు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆమె పోలీసులకు ఆదేశాలిచ్చారు. అయితే..ఆమె ఆదేశాలను పోలీసులు ఎక్కడా పాటించడంలేదు. గత పాలకుల సమయంలో ఎలా వ్యవహరించారో..అదేరీతిన ఇష్టారాజ్యంగా కొందరు వ్యవహరిస్తున్నారు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.
పేపర్లేదు...పెన్నూలేదు...తెచ్చుకోండి...!
విజయవాడలోని పటమట పోలీస్స్టేషన్లో నిన్న జరిగిన ఓ సంఘటన. తాను నడుపుతోన్న ఓ హోటల్పై కొందరు ఆగంతకులు సాయంత్రం ఆరుగంటలప్పుడు దాడి చేశారని, వారిపై చర్య తీసుకోవాలని కోరిన ఓ వ్యక్తినుద్దేశిస్తూ ఫిర్యాదు రాసుకురండి..అంటే పేపర్..పెన్నూలేదు..మీరే తెచ్చుకోండి..! ఇక్కడ పెన్నులు దుకాణం పెట్టుకోలేదు..మీరే తెచ్చుకుని..ఫిర్యాదు రాసివ్వండి..ఇది..రైటర్ మాట...ఇంత వరకూ అయితే..ఫర్వాలేదు..కానీ..ఈ రైటర్ ఇంకా ముందుకెళ్లి ఫిర్యాదుదారుపై దుర్భాషలు ఆడాడు..!
రైటర్ః ఎక్కడ ఉంటావురా....?
ఫిర్యాదిదారుః పడమట రామాలయం దగ్గర...!
రైటర్ః అరేయ్..30 సంవత్సరాల నుండి..ఇక్కడే ఉంటున్నాను..నిన్నెక్కడా చూడలేదురా..?
ఫిర్యాదిదారుః సార్..20 సంవత్సరాల నుంచి అక్కడే హోటల్ నడుపుతున్నాసార్...:
రైటర్ః అరేయ్..నిన్నెక్కడా చూడలేదురా..?
(గౌవరంగా హోటల్ నడుపుకునే వ్యక్తి పోలీస్స్టేషన్కు ఎందుకు వస్తాడు..రైటర్ ఆ వ్యక్తిని చూడాల్సిన అవసరం ఏముంది...;? ఆయనేమన్నా అసాంఘిక శక్తా...? లేక రౌడీషీటరా...? ఈయనగారు..చూడడానికి..పోలీస్స్టేషన్కు ప్రతివాళ్లు వస్తారా..? అన్యాయం జరిగినప్పుడు కదా..పోలీస్స్టేషన్కు వచ్చేది..ఈయనకుమొహం చూపించడానికి హోటల్ నడుపుకునే వ్యక్తి రోజూ ఈయనగారికి వచ్చి...సార్..నామోహం చూడండి..అని చెప్పాలా...? కొంచెమన్నా ఇంగితం ఉండాలి కదా..? ఏమి మాట్లాడుతున్నామో..అని...? )
ఫిర్యాదిదారుః సార్..నాహోటల్పై దాడిచేశార్..సార్..ఫిర్యాదు ఇస్తాను తీసుకోండిసార్..
రైటర్ః ఇక్కడ పేపర్..పెన్నులు లేవ్..నువ్వే తెచ్చుకునిరాసుకొని ఇవ్వు..మాకేం పనిలేదనుకున్నావురా..?
ఫిర్యాదుదారు పక్కన వచ్చిన వ్యక్తులు పెన్ను, పేపర్ ఇవ్వండిసార్..ఫిర్యాదు రాసిస్తాడంటే..వాడి తరుపున మీరేంది..బయటకు పొండి..ప్రతినాకొడుకూ పెత్తనం చేశావాడే..? ఇదీ ఆ రైటర్ తీరు......ఆయన తీరు చూసిన ఫిర్యాదు దారు ఖంగుతిన్నారు..వాళ్లు చేసిన నష్టంకంటే..రైటర్ చేసిన అవమానంతో ఫిర్యాదు ఇవ్వకుండానే..ఇంటి మొహం పట్టాడు..ఇది..పటమట పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగిన తంతు. సామాన్య ఫిర్యాదుదారులను బండబూతులు తిడుతూ, అమర్యాదా, అగౌవరంగా, మొరటుగా వ్యవహరిస్తున్నారు. పాలకులూ, సీనియర్ అధికారులేమో..ఫ్రెండ్లీపోలీస్ అంటుంటే..కిందస్థాయి పోలీసులు మాత్రం నోటికి పనిచెప్పి పోలీస్స్టేషన్కు వచ్చిన వారిని అవమానాలు పాలుచేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోయినా..ఫర్వాలేదులే కానీ..పోలీస్స్టేషన్ గుమ్మం మాత్రం తొక్కకూడదని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.నూతన హోం మంత్రి ఇటువంటి పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా విజయవాడ పటమట పోలీసుల తీరుమాత్రం దారుణం...సామాన్యులను గౌరవించడంపై వీరికి శిక్షణ ఇప్పించాలి.