I&PR డైరెక్టర్ గా హిమాన్ష్ శుక్లా నియామకం
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్గా ఉన్న విజయ్కుమార్రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు. అప్పటి నుంచి సమాచారశాఖ కమీషనర్గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అయితే..ఈరోజు పలువరు ఐఏఎస్లను బదిలీలు చేస్తూ సమాచారశాఖకు శుక్లాను డైరెక్టర్గా నియమించింది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో సమాచారశాఖ వైకాపా కార్యాలయంగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అప్పటి కమీషనర్ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణ త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది. విచారణలో గత ఐదేళ్ల అక్రమాలను ప్రభుత్వం బయటకు తెస్తుందని, అదే సమయంలో గత కమీషనర్ అక్రమాలకు సహకరించిన వారందరిపై కూడా విచారణ జరుగుతుందంటున్నారు. కాగా సమాచారశాఖ డైరెక్టర్గా నియమితులైన శుక్లాకు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. నేరుగా ఐఏఎస్కు ఎంపికైన శుక్లా సమాచారశాఖను గాడిలో పెడతారని, అక్రమార్కుల భరతం పడతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యువ ఐఏఎస్ ను సమాచారశాఖ బాధ్యతలు అప్పచెప్పింది. గత కొన్నాళ్ల నుంచి సమాచారశాఖకు ఐఐఎస్కు చెందిన అధికారులే కమీషనర్గా పనిచేస్తూ వచ్చారు. అయితే..చంద్రబాబు ప్రభుత్వం సమాచారశాఖను ప్రక్షాళన చేసే పనిలో భాగంగా యువ అధికారికి ఈ పనిని అప్పచెప్పినట్లు తెలుస్తోంది.