లేటెస్ట్

2029 నాటికి ఎపిలో 225 అసెంబ్లీ సీట్లు...!?

మ‌హిళ‌ల‌కు 75స్థానాలు

నూత‌న నాయ‌క‌త్వానికి అవ‌కాశాలు..!

యువ‌త‌కు పెర‌గ‌నున్న సీట్లు..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు భారీగా పెర‌గ‌బోతున్నాయి. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం సాగుతున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా, విభ‌జిత చ‌ట్టం ప్ర‌కారం రాష్ట్రంలోని శాస‌న‌స‌భలో అసెంబ్లీ సీట్ల‌ను పెంచ‌బోతున్నారు. విభ‌జిత చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్రాలో 175 సీట్లు ఉండ‌గా, వాటిని 225కు, తెలంగాణ‌లో 119 సీట్లు ఉండ‌గా వాటిని 175కు పెంచుతామ‌ని చ‌ట్టంలో కేంద్రం పేర్కొంది. అయితే ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్ప‌డంతో..అసెంబ్లీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో వ‌స్తాయ‌ని చాలా మంది అంచ‌నా వేస్తున్నారు. అయితే..వారు అంచ‌నాలు త‌ప్పు. ఎందుకంటే..జ‌మిలి ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా..లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు..రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మొన్న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు, లోక్‌స‌భ ఎన్నిక‌లు ఒకేసారి జ‌రిగాయి. ఒక‌వేళ కేంద్రం చేసిన చ‌ట్టం పార్ల‌మెంట్ ఆమోదించి ఎన్నిక‌లు జ‌రిగితే..లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యుల్ ప్ర‌కారం 2029లోనే జ‌రుగుతాయి.  త‌ప్ప‌..ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముందు జ‌ర‌గ‌వు. అయితే..ఈలోపు మాత్రం చాలా మార్పులు రాబోతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెర‌గ‌బోతోంది. 175 స్థానాల‌ను 225కు పెంచుతారు. అయితే..లోక్‌స‌భ సీట్లు త‌గ్గే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న 25 పార్ల‌మెంట్ స్థానాల్లో క‌నీసం రెండు నుంచి మూడు త‌గ్గుతాయంటున్నారు. జ‌నాభా ప్రాతిప‌దికిన లోక్‌స‌భ స్థానాల పెంపు..త‌గ్గింపూ ఉంటుంది. దాని ప్ర‌కారం ద‌క్షిణాది రాష్ట్రాల్లో జ‌నాభా నియంత్ర‌ణ ఉండ‌డంతో..లోక్‌స‌భ స్థానాలు త‌గ్గ‌డం ఖాయం. కాగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు అమ‌లులోకి వ‌స్తున్నందున‌..మ‌హిళ‌ల ప్రాతినిధ్యం భారీగా పెర‌గ‌నుంది. 33శాతం మ‌హిళ‌ల‌కు కేటాయించ‌నున్నందున దాదాపు 75 మంది మ‌హిళ‌లు అసెంబ్లీకి రానున్నారు. లోక్‌స‌భ‌లోనూ..అదే ప‌రిస్థితి ఉంటుంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ