లేటెస్ట్

దటీజ్ అఖిల ప్రియ

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అఖిలప్రియ సేవలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అభివృద్ధి పనులు ప్రారంభం జరగడం ప్రజల్లో ఆనంద ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా నంద్యాలలోని విజయ డైరీలో ఉన్న నందమూరి తారక రామారావు శిలాఫలకాన్ని తొలగించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ అక్కడికి చేరుకొని విజయ డైరీ చైర్మన్ ఎస్ వి మోహన్ రెడ్డి చాంబర్ లోనికి వెళ్లి ఆయన కుర్చీలో ఆమె కూర్చున్నారు. ఆ సందర్భంలో చైర్మన్ కు ఎమ్మెల్యే అఖిలప్రియ కు ఫోన్ కాల్లో వాగ్వాదం జరిగింది. చైర్మన్ సాంబార్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంతో ఆమె ఫైర్ అయ్యారు. వెంటనే జగన్ ఫోటోను తీయించి చంద్రబాబు ఫోటోలు పెట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయ డైరీలో జరుగుతున్న అవకతవకలను గురించి లోపాలను గురించి ఆమె చర్చించి చైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని అన్ని మండలాల ను అభివృద్ధి  పథంవైపు నడిపిస్తున్నారు. 


అఖిలమ్మ మంత్రిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడున్న రాజకీయ అనుభవము ఆమె స్పీడును చూసిన ప్రజలు ఆమె గురించి చర్చించుకుంటున్నారు. ఆమెపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టిన కూడా ఆమె భయపడలేదు. ఆమెపై నిందల మోపిన వారిని ఆధారాలు చూపించమంటూ విరుచుకపడ్డారు. మీరు ఏమేమి అన్యాయాలు అక్రమాలు చేశారో నా దగ్గర కూడా రెడ్ బుక్కు ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు ప్రత్యర్థుల్లో వణుకు పుట్టింది. ఈ విషయం పై ప్రజలు ఆడపిల్ల అయినా ఆళ్లగడ్డకు సరైన నాయకురాలేనని ఎమ్మెల్యే అఖిలప్రియ గురించి చర్చించుకుంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ