లేటెస్ట్

‘విజ‌య‌సాయిరెడ్డి’ని న‌మ్మ‌వ‌చ్చా...?

మ‌ద్యం కుంభ‌కోణంలో వైకాపా మాజీ రాజ్య‌స‌భ సభ్యుడు ‘విజ‌య్‌సాయిరెడ్డి’ ఈరోజు సీఐడి విచారించింది. ఈ కేసులో సాక్షిగా హాజ‌రైన ఆయ‌న మ‌ద్యం కుంభ‌కోణం గుట్టు విప్పాడ‌ని ‘టిడిపి’ అనుకూల మీడియా ప్ర‌చారం చేస్తోంది. దీనిలో వాస్త‌వం ఏమిటో తెలియ‌దు కానీ..ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడిన తీరును చూసిన వారికి  మ‌ద్యం కుంభ‌కోణంలో సూత్ర‌ధారుల‌ను కాపాడ‌డానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌ద్యం కుంభ‌కోణం మొత్తం ‘క‌సిరెడ్డి’ చుట్టూనే ‘విజ‌య‌సాయిరెడ్డి’ తిప్పుతున్నారు. దీనిలో ‘క‌సిరెడ్డి’, ‘మిధున్‌రెడ్డి’తో పాటుమ‌రో ఇద్ద‌రు కీల‌క సూత్ర‌ధారుల‌ని ఆయ‌న చెప్పారు. ‘క‌సిరెడ్డి’ త‌న‌ను మోసం చేశాడ‌ని,‘క‌సిరెడ్డి’ తెలివైన క్రిమిన‌ల్ అని, ‘క‌సిరెడ్డి’కి త‌న బంధువుల సంస్థ నుంచి రూ.100కోట్ల లోన్ ఇప్పించాన‌ని, అయితే దానిలో రూ.60కోట్ల‌కు వ‌డ్డీ క‌ట్ట‌డం లేద‌ని, ‘క‌సిరెడ్డి’ వ‌ల్ల తాను మోస‌పోయాయ‌ని ఆయ‌న చెప్పారు. ‘క‌సిరెడ్డి’ వెనుక ఎవ‌రున్నారో త‌న‌కు తెలియ‌ద‌ని,‘ క‌సిరెడ్డి’ని దీని గురించి అడ‌గాల‌ని, ఆయ‌నే త‌న వెనుక ఉన్న ‘బిగ్‌బాస్’ గురించి చెబుతార‌ని అన్నారు. త‌న‌ను నాలుగు ప్ర‌శ్న‌లు అడిగార‌ని, వాటికి తాను స‌మాధానాలు ఇచ్చాన‌ని చెప్పారు. ‘జ‌గ‌న్’ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత చేసిన నిర్ణ‌యం మ‌ద్యంపైనే అని, అది త‌న ఇంట్లోనే జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు. తాను ‘వైకాపా’లో నెంబ‌ర్ టూ కాద‌ని, త‌న స్థానం 2వేల‌ల్లో ఉంద‌ని, కోట‌రి త‌న‌పై ‘జ‌గ‌న్‌’కు పితూరీలు చెప్పింద‌ని, దాన్ని ఆయ‌న న‌మ్మి దూరం పెట్టార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మొత్తం మీద మ‌ద్యం కుంభ‌కోణంలో ‘జ‌గ‌న్’ ప్ర‌మేయం గురించి నేరుగా చెప్పేందుకు ‘విజ‌య‌సాయిరెడ్డి ఇష్ట‌ప‌డ‌డం లేదు. కుంభ‌కోణం జ‌రిగింద‌నే మాట‌ను అంగీక‌రిస్తూనే దీనిలో ‘జ‌గ‌న్’ హ‌స్తం లేద‌న్న‌ట్లుగా..అంతా ‘క‌సిరెడ్డే’ చేసిన‌ట్లుగా చెప్ప‌డానికి ఆయ‌న తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ‘జ‌గ‌న్ గురించి తాను ఏమీ చెప్ప‌లేద‌ని ఎవ‌రికో సిగ్న‌ల్ పంప‌డానికి ఆయ‌న తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ కేసులో నుంచి ‘జ‌గ‌న్‌’ను త‌ప్పించి ‘క‌సిరెడ్డి’ని, ‘మిధున్‌రెడ్డి’ని ఇరికించాల‌నే ఎత్తుగ‌డ‌తో ఆయ‌న ఉన్నార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రో వైపు త‌న‌ను ‘జ‌గ‌న్‌’కు కోట‌రీ దూరం చేసింద‌ని, ‘సాక్షి’లో త‌న‌ను తిట్టార‌ని, ‘సాక్షి’ని తానే ఏర్పాటు చేశాన‌ని చెప్పుకున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు..గంద‌ర‌గోళంగా ఉంది. దేనికీ నేరుగా స‌మాధానాలు చెప్ప‌కుండా త‌న‌కు తెలియ‌ద‌ని, గుర్తు లేద‌ని, మీడియాపై చిరాకుప‌డుతూ.. అస‌హ‌నంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రికి మేలు చేస్తాయో..ఎవ‌రికి కీడు చేస్తాయో..త్వ‌ర‌లో తేలుతుంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ