లేటెస్ట్

‘జగన్‌’ కన్నా మిన్నగా ‘మత్స్యకారభరోసా’...!?

కూటమి ప్రభుత్వం సంక్షేమపథకాలను అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ‘వైకాపా’ అధినేత ‘వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి’ పదే పదే విమర్శిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌లేదూ..సూపర్‌ సెవన్‌లూ లేదంటూ..ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ‘చంద్రబాబు’ బిర్యానీ పెడతారని ఆయనకు ప్రజలు ఓట్లు వేశారని, అయితే..‘చంద్రబాబు’ వారిని మోసం చేశాడని పదే పదే ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఆరోపణలు ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు దాటుతున్నా సంక్షేమ పథకాలను అమలు చేయలేదని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లును భారీగా పెంచింది. గతంలో ‘జగన్‌’ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా..కూటమి ప్రభుత్వం అధికంగానే ఖర్చు చేస్తోంది. అయితే..దీనిని పక్కకు పెట్టి సూపర్‌ సిక్స్‌ అమలు చేయడం లేదని, విద్యార్థులుకు ఇస్తానన్న రూ.15వేలు ఇవ్వలేదని ‘చంద్రబాబు’ మోసగాడని ‘జగన్‌’ ఆరోపిస్తున్నారు. అయితే..ఆయన ఆరోపణలను కొట్టిపారేస్తూ ‘కూటమి ప్రభుత్వం’ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. కూటమి మొదటి సంతకమైన ‘మెగా డిఎస్సీ’ని విడుదల చేసింది. అదే సమయంలో..ఇప్పుడు ‘మత్స్యకార భరోసా’ పథకం కింద ‘మత్స్యకారులకు’ భారీగా నిధులను వారి ఖాతాల్లో వేయబోతోంది. రేపు ఉదయం ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ‘మత్స్యకార భరోసా’ కింద ఒక్కో కుటుంబానికి రూ.20వేలు వారి ఖాతాల్లో జమచేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నేరుగా ప్రారంభించి, మత్స్యకారులతో ముచ్చటించనున్నారు. 


‘జగన్‌’ రూ.10వేలు ఇస్తే..‘బాబు’ రూ.20వేలు...!

గతంలో ‘జగన్‌’ ప్రభుత్వం మత్స్యకారుల వేట నిషేద సమయంలో వారికి రూ.10వేలు భరోసాగా ఇచ్చేది. దీనితో పాటు సబ్సీడీ కింద డీజిల్‌ సరఫరా చేసేది. మొత్తంగా ‘జగన్‌’ ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పథకం కింద రూ.123కోట్లు ఖర్చుచేసేది. దీని వల్ల దాదాపు 1,23,159 కుటుంబాలు లబ్ది పొందేవి. అయితే ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఈ నిధులను భారీగా పెంచింది. దీని కింద తొలిసారి దాదాపు రూ.258కోట్లు ఖర్చు చేయబోతోంది. దీని వల్ల 1,28,178 కుటుంబాలు లబ్ది పొందబోతున్నాయి. అంటే దాదాపు రెట్టింపు నిధులను ‘మత్స్యకారులకు’ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోంది. ‘జగన్‌’ పదివేలు ఇస్తే..‘చంద్రబాబు’ రూ.20వేలు ఇస్తున్నారు. సంక్షేమం అంటే ఇదని టిడిపి కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే..‘జగన్‌’ కంటే మిన్నగా సంక్షేమపథకాలను అమలు చేస్తామని ‘చంద్రబాబు’ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ..నేడు ‘మత్స్యకారులకు’ భారీగా నిధులను అందించబోతున్నారు. వేట నిషేదసమయంలో ‘మత్స్యకారులకు’ ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఇవి కాకుండా ప్రమాదభీమా కింద రూ.10లక్షలు, సబ్సీడీ డీజిల్‌ను ఇవ్వనున్నారు. మొత్తం మీద ‘చంద్రబాబు’ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఒక పద్దతి ప్రకారం అమలు చేసుకుంటూ వస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కింద దాదాపు రూ.1290కోట్లు ఖర్చు చేయబోతోంది. ‘జగన్‌’ ఐదేళ్లలో ఈ పథకం కింద కేవలం రూ.615కోట్లు ఖర్చుచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుంటే ‘చంద్రబాబు’ టైమ్‌లో సంక్షేమం డబుల్‌ అయినట్లేనని చెప్పుకోవచ్చు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ