జగన్కు లక్కీఛాన్స్...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి కాలం కలిసి వస్తోంది. ఆయనంతట ఆయనే సృష్టించిన సమస్యలకు పరిష్కారం దొరక్క, ప్రజలను మెప్పించలేక గత ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఆయన గతంలో సృష్టించిన సమస్యలకు ఆయన ఓడిపోయి ఏడాది కావస్తున్నా ఆయనకు ఇంకా ఓ పరిష్కార మార్గం లభించలేదు. రాబోయే ఎన్నికల నాటికి కూడా వాటికి పరిష్కార మార్గం దొరకదేమో అనుకుంటుంటే..హఠాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆయనో పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో ఆయనకు పరిష్కార మార్గం లభించింది అంటారా..? అదేనండి మూడు రాజధానుల సమస్య. 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయనకు ప్రజలు పట్టం కడితే..దోపిడియే లక్ష్యంగా ఆయన పలు వక్రమార్గాలను అవలంభించారు. అలా వక్రమార్గంలో తీసుకున్న నిర్ణయమే మూడు రాజధానుల ప్రతిపాధన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలోనే ఇళ్లు కట్టుకున్నాను. ఇదే రాజధాని అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో..వెంటనే మాట మార్చేసి దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు రాజధానులంటూ..మూడు రాజధానుల విన్యాసానికి తెరతీశారు. దీంతో..ఆయనను గెలిపించిన వారు ముక్కున వేలేసుకున్నారు. అసలే విభజనతో అల్లాడుతుంటే ఇప్పుడు మూడు రాజధానులు ఏమిటంటూ..మెజార్టీ ప్రజలు అవాక్కు అయ్యారు. అయితే..తన అధికార బలం, రౌడీయిజంతో..జగన్ ప్రజల నోళ్లు మూయించారు. అయితే..ప్రజలేమీ అమాయకులు కారు. వారికి అవకాశం దొరికేవరకూ మౌనం వహించి..అవకాశం దొరికిన తరువాత ఓట్లరూపంలో కర్రుకాల్చివాతపెట్టారు. రాజధాని ప్రాంతంలో సింగిల్ సీటు కూడా ఇవ్వకుండా, ఇంకా చెప్పాలంటే..శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఘోరాతి ఘోరంగా ఓడించారు. ఆయన చేసిన అనేక అవకతవక పనుల్లో ఈ మూడు రాజధానులు ప్రధానమైనది.
కేవలం మూడు రాజధానులు అనే కాకుండా అప్పటికే ఎంతో కొంత నిర్మితమైన అమరావతిని శ్మశానం అంటూ నోరుపారేసుకుని దానికి ఫలితాన్ని అనుభవించారు. అయితే..ప్రతిపక్షంలోకి వచ్చి..ఏడాది కావస్తున్నా..ఇప్పటికీ ఆయన మూడు రాజధానులపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. మాటి మాటికి మళ్లీ అధికారంలోకి వస్తాం..అంతు చూస్తాం అంటూ రంకెలేస్తున్నారు కానీ, అప్పట్లో తాను సృష్టించిన సమస్య గురించి ఆయన ప్రస్తావించడం లేదు. ఇప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నారా..? లేదా..అనేదానిపై ఆయన ఏమీ మాట్లాడడం లేదు. అయితే..ఆయన పార్టీ కానీ, ఆయన కానీ..ఏమీ చెప్పకపోయినా.. మూడు రాజధానుల సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపెడుతున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రారాజధానిపై కేంద్రం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. అయితే..ఇప్పడు అమరావతి పున్నర్మాణపనులను ప్రధాని నరేంద్రమోడీతో ప్రారంభింపనున్నారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంలో పార్లమెంట్లో ఆంధ్రా రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్దత చేయిస్తానని ఆయన అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో ఇప్పటి వరకూ నెలకొన్న ఆందోళన సమసిపోతుంది. అయితే..ఇదే సందర్భంలో జగన్ లక్కీఛాన్స్ కొట్టేస్తున్నారు. కేంద్రం అమరావతిని రాజధానిగా చట్టబద్దం చేస్తే.. అమరావతిపై కేంద్రమే చట్టం చేసింది కనుకు తాను కూడా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాను అని సింపుల్గా చెప్పేస్తారు. కేంద్రం తేల్చింది కనుక ఇక మూడు రాజధానుల ప్రస్తావన లేదని ఈ నాలుగేళ్లు నాటకాలు ఆడవచ్చు. నాలుగేళ్ల తరువాత..ప్రజలు మరోసారి తనను నమ్మితే..అప్పుడు మళ్లీ నాలుగో..ఐదో..ఆరో...లేక ఇంటికో రాజధాని అంటూ కాలక్షేపం చేయవచ్చు. మొత్తానికి నాలుగేళ్లపాటు..జగన్ సమాధానం చెప్పుకోలేని సమస్యకు చంద్రబాబు..ఓ పరిష్కారం చూపుతున్నారు. ఎంతైనా..జగన్ లక్కీనే..లేకపోతే..వేలకోట్ల అవినీతికి పాల్పడి..ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి..మళ్లీ మరో ఐదేళ్ల్లో ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడం అంటే..ఆయనెంత లక్కీఫెలోనో..