లేటెస్ట్

స‌గం మంది మ‌న‌కుల‌పోల్లే...!

జ‌గ‌న్ పార్టీ ప‌రిశీల‌కులు వీరే...!

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఉన్నంత కుల‌త‌త్వం ఎవ‌రికీ లేద‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. మాట్లాడితే..టిడిపిపై కుల‌ముద్ర వేయ‌డానికి ప‌దే ప‌దే య‌త్నించే ఆయ‌న తన పార్టీలో మాత్రం త‌న కులానికే ఎక్కువ పోస్టులు ఇచ్చుకుంటారు. గ‌తంలో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా..అన్ని ముఖ్య‌మైన పోస్టుల్లో త‌న కుల‌స్తుల‌కే ఇచ్చేసుకున్నారు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం, డీజీపీ, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వితో పాటు అన్ని కీల‌క‌మైన ప‌ద‌వులూ త‌న కులానికి చెందిన వారికే  పంచేశారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక కూడా..త‌న తీరు మార్చుకోలేదు. ఈరోజు ప్ర‌క‌టించిన పార్ల‌మెంట‌రీ పార్టీ ప‌రిశీల‌కుల ప‌ద‌వుల్లో దాదాపు స‌గం మంది త‌న కులానికి చెందిన వారినే నియ‌మించుకున్నారు. మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాలు ఉంటే..దానిలో 12 స్థానాలు రెడ్ల‌కు కేటాయించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల‌కు నామ‌మాత్రంగా ప‌రిశీల‌కుల ప‌ద‌వులు ఇచ్చారు. వైకాపాకు గ‌ట్టి మ‌ద్ద‌తుదారులైన ఎస్సీల‌ను ప‌ద‌వుల పంప‌కంలో ఆయ‌న ప‌ట్టించుకోలేదు. త‌న స్వంత కులానికి మాత్రం వెతికి వెతికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా లేని వారైనా త‌న కుల‌పువారైతే చాలు..వారికి ప‌ద‌వులు అప్ప‌గించేశారు. త‌న కుల‌స్తులు త‌ప్ప ఆయ‌న న‌మ్మ‌క‌స్తులు ఎవ‌రూ లేరేమో..? ఒక‌ప్పుడు 32మంది క‌మ్మ డిఎస్పీల‌కు చంద్ర‌బాబు ప్ర‌మోష‌న్లు ఇచ్చారంటూ..ఢిల్లీ వ‌ర‌కూ వెళ్లి నానా యాగి చేసిన జ‌గ‌న్ త‌రువాత దాన్ని నిరూపించ‌లేక‌పోయారు. చివ‌రకు అసెంబ్లీ సాక్షిగా తాను చెప్పింది అబ‌ద్ద‌మంటూ..ఆయ‌నే చెప్పుకున్నారు. ప‌క్కోడి కుల‌ముద్ర వేయాల‌నే ఆరాటం త‌ప్ప‌..తాను ఏమి చేస్తున్నాడో..త‌న కుల‌స్తుల‌కు ఎన్ని ప‌ద‌వులు ఇచ్చాడో..ఆయ‌న ఎప్పుడూ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోరు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ