శవ రాజకీయాలు షురూ...!?
సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి క్యూకాంప్లెక్స్ పక్కన గోడ హఠాత్తుగా కూలిపోవడంతో ఏడుగురు భక్తులు దుర్మరణం చెందగా మరో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పెద్ద ఎత్తున్న సహాయక చర్యలు చేపడుతోంది. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. స్వామివారి చందనోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భారీగా హాజరయ్యారు. అయితే..భక్తుల రద్దీని తట్టుకునేందుకు, కొండ దిగువన గల సింహగిరి బస్తాండ్ నుండి కొండపైకి వేళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో కొత్తగా క్యూకాంప్లెక్స్ నిర్మించారు. అయితే మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో అక్కడ నిర్మించిన గోడ నాని కూలిపోయింది. ఈ సంఘటనలో పలువురు మృతి చెందారు. అయితే.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు గత పదిరోజుల నుంచి అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా..అనుకోని దురదృష్టకర సంఘటన జరిగిపోయింది. దీంతో ప్రభుత్వంపై అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రెండో సంఘటన ఇది అని..ప్రభుత్వం భక్తులను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా..ఈ సంఘటనపై వైకాపా సోషల్ మీడియా అప్పుడే శవరాజకీయాలకు దిగుతోంది. సంఘటన జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోకుండానే వైకాపాకు మద్దతు ఇచ్చే ఛానెల్స్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా సాక్షి ఛానెల్ దీనిపై అప్పుడే డిబేట్ నడిపింది. మరోవైపు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే యూట్యూబ్ ఛానెల్స్ దీనిపై ప్రత్యేకంగా వార్తలను వండివారుస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం అంటూ..చేతకాని తనం అంటూ..అవినీతి వల్లే ఇలా జరిగిందని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. వైకాపా నాయకులందరూ లైవ్లోకి వచ్చి ప్రభుత్వాన్ని దునుమాడుతున్నారు. గతంలో..తిరుపతి సంఘటన, ఇప్పుడు సింహాచలం సంఘటతో వైకాపా శవరాజకీయాలను మళ్లీ షురూ చేసిందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. మొత్తం మీద..కూటమి ప్రభుత్వానికి దేవాలయాల విషయంలో పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.