లేటెస్ట్

రెండు వేల కోట్లు కొల్లగొట్టిన ‘బిఆర్‌ఎస్‌’

వైకాపా రూ.662కోట్లు, టిడిపి: 437కోట్లు

ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో రాజకీయపార్టీలు వివిధ వ్యాపార సంస్థల నుంచి భారీగాఎన్నికల నిధులను వసూలు చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిది దీనిలో పెద్దన్న పాత్ర. ఆ పార్టీ దాదాపు రూ.11వేల కోట్లపైగా సొమ్ములను ఎన్నికల నిధులుగా వ్యాపార సంస్థల నుండి వసూలు చేసింది. ఇది మొత్తం బాండ్ల వసూల్‌లో 46.74శాతం. ఆ తరువాత ‘తృణమూల్‌కాంగ్రెస్‌, కాంగ్రెస్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగవ స్థానంలో ‘బిఆర్‌ఎస్‌’పార్టీ ఉంది. ఈ పార్టీ దాదాపు రూ.2,200కోట్లను వసూలు చేసంది. తరువాత ‘బిజూజనతాదళ్‌’, వైకాపా, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘బిఆర్‌ఎస్‌’ అగ్రస్థానంలోఉంది. దాని తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ‘వైకాపా’ రెండోస్థానంలో ఉంది. ఆ పార్టీ రూ.662 కోట్లను వసూలు చేసింది.మొత్తం బాండ్ల వసూల్‌లో ఇది 2.68శాతం. ప్రతిపక్ష తెలుగుదేశం దాదాపు రూ.437కోట్లు వసూలు చేసింది. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న ‘బిఆర్‌ఎస్‌’ (టిఆర్‌ఎస్‌) బాండ్ల రూపంలో వివిధ వ్యాపార సంస్థల నుంచి వసూళ్లను చేసుకుంది. దేశంలోనే ‘బిఆర్‌ఎస్‌’ నాల్గవస్థానంలో ఉంది. ‘కెసిఆర్‌’ అధికారంలో ఉన్నప్పుడు ఆయన భారీగా సాగునీటి ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. అయితే..ఆయా పనులను దక్కించుకున్న సంస్థలు దానికి ప్రతిఫలంగా ‘టిఆర్‌ఎస్‌’కు బాండ్ల రూపంలో నిధులను సమర్పించుకున్నారు. ముఖ్యంగా ‘మెఘా’ సంస్థ ఈ విషయంలో ముందుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏయే రాజకీయపార్టీలకు ఎంతెంత వచ్చింది..సవివరంగా బయటకు వచ్చింది.


అధికారంలో ఉన్న పార్టీలు ఆయా వ్యాపార సంస్థలతో అనైతిక ఒప్పందాలు, క్విడ్‌ప్రోకోకు పాల్పడి ప్రజల సొమ్ములను యధేచ్ఛగా దోచుకున్నాయని ఇప్పుడు ఆధారాలతో బయటకు వచ్చింది. తమకు లంచాలు ఇచ్చే సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెట్టడం, వారికి భారీగా రాయితీలు ఇవ్వడం, ప్రాజెక్టుల అంచనాలను అమాంతం పెంచేయడం, పేదల భూములను లాక్కుని ఆయా వ్యాపార సంస్థలకు కట్టబెట్టడం వంటి నీతిమాలిన పనులకు పాల్పడి, వారి ద్వారా బాండ్ల రూపంలో సొమ్ములు చేసుకుని రాజకీయ పార్టీలు భారీగా లాభపడ్డాయి. పదిహేనేళ్ల క్రితం స్థాపించిన ‘బిఆర్‌ఎస్‌’ పదేళ్లు అధికారంలో ఉండి దాదాపు రూ.2500కోట్లు దోచుకుందంటే..ఆపార్టీ తెలంగాణ ప్రజల సొమ్మును ఎంతగా కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టిందో దీని ద్వారా అర్థం అవుతోంది. అదే విధంగా ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోఅధికారంలోకి వచ్చిన ‘వైకాపా’ది కూడా..‘బిఆర్‌ఎస్‌’ దారే. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే..రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఆపేసి, ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామంటూ..‘రివర్స్‌ టెండరింగ్‌’అంటూ తనకు కావల్సిన వారికి ప్రాజెక్టు పనులు అప్పగించి వారి ద్వారా భారీగా అవినీతి సొమ్మును పోగేసుకుంది. ప్రతిష్టాత్మకమైన ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణపనులను ‘మెఘా’ సంస్థకు కట్టబెట్టి వారి వద్ద నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో సొమ్ములు వసూలు చేసిందని ప్రస్తుతం విడుదల చేసిన ఎలక్ట్రోరల్‌ బాండ్లు వివరాల్లో తెలియవస్తోంది. అదే విధంగా ప్రతిపక్ష టిడిపి కూడా..దీనిలో పాత్రధారే. అయితే..ఆ పార్టీది నామమాత్రమైన వాటనే. ఐదేళ్లు అధికారంలో ఉన్న ‘టిడిపి’ రూ.437కోట్లనే వసూలు చేసింది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ