'జగన్' సలహాకు ఫిదా అయిన 'మోడీ'...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మూడు రోజుల రాజధాని పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. మొన్న రాజధాని ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ప్రధాని మోడీని కలిసిన తరువాత..ఏం జరిగిందనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిపై ఫిర్యాదు చేశారని, ముఖ్యంగా పోలవరం, రాజధాని అమరావతిలో జరిగిన అవినీతి గురించి ప్రధానికి వివరించారని చెబుతున్నారు. దీనిపై తన వద్ద ఉన్న ఆధారాలను ప్రధానికి అందించారని, ఈ సందర్భంగా కేంద్ర సంస్థలతో చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలని కోరారని అంటున్నారు. 'జగన్' అధికారంలోకి వచ్చిన తరువాత...గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, దాన్ని వెలికి తీస్తామని చెబుతూ వస్తున్నారు. దీనిలో భాగంగా పలు విచారణ కమిటీలను ఏర్పాటు చేశారు. 'పోలవరం' ప్రాజెక్టుపై వేసిన విచారణ కమిటీ కాంట్రాక్టు సంస్థకు గత ప్రభుత్వం భారీగా దోచిపెట్టిందని తేల్చింది. అదే సమయంలో విద్యుత్ ఒప్పందాలపై వేసిన కమిటీ కూడా తన నివేదికను ఇచ్చింది. విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని 'జగన్' ప్రభుత్వం చెబుతుండగా..ఈ విషయంపై కేంద్ర విద్యుత్శాఖ మంత్రితో పాటు ఆశాఖ అధికారులు ఖండిస్తూ లేఖలు రాశారు. దీంతో పీపీఏలను పక్కన పెట్టిన 'జగన్' పోలవరం, రాజధాని అమరావతి అవినీతి గురించి ప్రధానికి చెప్పారని, ఈ అవినీతిపై విచారణ చేయిస్తే...రాజకీయంగా ఇద్దరికీ లాభసాటిగా ఉంటుందని చెప్పారని, దానికి ప్రధాని అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ప్రస్తుతం రాజధానిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని 'మోడీ'ని 'సిఎం' జగన్ కలిసే అవకాశమే లేదు. కానీ..ఆశ్చర్యకరంగా...'జగన్'తో 'మోడీ' 45 నిమిషాలు సమావేశమయ్యారు. ఒకవైపు కాశ్మీర్ విషయంలో హడావుడిగా ఉన్న 'మోడీ' సిఎం 'జగన్'తో అంత సమయం వెచ్చిచడం వెనుక...'జగన్' వ్యూహం ఉందంటున్నారు. 'చంద్రబాబు' ఇద్దరికీ రాజకీయ శత్రువని..మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయినా..ఇంకా క్యాడర్, నాయకులు, ప్రజలు చాలా మంది ఆయన వైపు ఉన్నారని, మరో ఐదేళ్లకైనా...ఆయన రాజకీయంగా మళ్లీ నిలబడతారని, అప్పుడు 'మోడీ'కి ఆయనతో ప్రమాదం ఉంటుందని, ఇప్పుడే ఆయనను అణిచివేస్తే...భవిష్యత్లో వచ్చే ప్రమాదాలను తప్పించుకోవచ్చునని..'జగన్' పిఎంకు సలహా ఇచ్చాడంటున్నారు. ఎప్పటి నుంచో..'చంద్రబాబు'పై ఒకరకమైన ధ్వేషంతో ఉన్న 'మోడీ' మొన్నటి సార్వత్రికఎన్నికల తరువాత మరింతగా పెంచుకున్నారు. దేశ వ్యాప్తంగా తన వ్యతిరేకులను కూడగట్టి..తనను గద్దె మీద నుంచి దింపాలని ప్రయత్నించిన 'చంద్రబాబు'పై పగ తీర్చుకోవడానికి, ఆయనను నేల మట్టం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్న 'జగన్' సలహాకు 'మోడీ' ఫిదా అయ్యారని ప్రచారం జరుగుతోంది.
'జగన్' 'మోడీ'కి ఇచ్చిన సలహా తెలిసే..ఈ రోజు 'చంద్రబాబు' ఆయనపై ఫైర్ అయ్యారని అంటున్నారు. గుంటూరు జిల్లాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..ఎవరు ఎంత వేధించినా..తాను పోరాటం ఆపనని, పోరాటంలో ముందుంటానని 'చంద్రబాబు' ఆవేశంగా ప్రకటించడం వెనుక...కారణమిదేనని అంటున్నారు. ప్రస్తుతానికి 'జగన్' వల్ల 'బిజెపి'కి వచ్చిన నష్టమేమీ లేదు కనుక...కొన్నాళ్లు ఆయనకు సహకరించాలనే భావనతో 'మోడీ' ఉన్నారని, అదే సమయంలో సమయం వచ్చినప్పుడు..చూసుకోవచ్చునని భావనతో..ఆయన ఉన్నారంటున్నారు. ఇదే సమయంలో 'జగన్' కూడా 'చంద్రబాబు'ను రాజకీయంగా అణచడానికి, తనపై గతంలో కేసులు పెట్టించి..అవినీతిపరుడు అని ప్రచారం చేయించిన దానికి ప్రతీకారంగా ఆయనపై కూడా సీబీఐ కేసులు నమోదు చేయించి తగిన శాస్తి చేయాలనే తలంపుతో ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి శత్రువైన 'చంద్రబాబు' సంగతి చూసిన తరువాత...మిగతా విషయాలు చూసుకోవాలన్న 'జగన్' సలహా 'మోడీ'కి నచ్చిందని, అందుకే ఆయన 'జగన్'తో అంతసేపు సమావేశమయ్యారంటున్నారు. మొత్తం మీద...'జగన్' ఇచ్చిన సలహాతో త్వరలో పోలవరం, రాజధానిపై సీబీఐ విచారణ జరుగుతుందంటున్నారు. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..!?