లేటెస్ట్

ప్రజల్లో కలిసిపోతున్న ‘లోకేష్‌’

ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం సుధీర్ఘపాదయాత్రను తలపెట్టిన టిడిపి ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. నిన్న ‘కుప్పం’లో పాదయాత్రను ప్రారంభించిన ‘లోకేష్‌’ రెండోరోజు పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలోని ‘శాంతిపురం’ మండలంలో కొనసాగించారు. ఉదయాన్నే పాదయాత్రకు బయలు దేరిన ఆయనకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎదురేగి ఆహ్వానించారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ ఆయన పలకరిస్తూ వారి సమస్యలను వింటూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. వ్యక్తిగత సమస్యలతో కలిసేవారితో కూడా ఆయన మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు.


మూడున్నరేళ్ల వైకాపా ప్రభుత్వ అరాచకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంలో సెక్యూరిటీని పక్కకకు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరు వెళుతూ వారిని ఆపాయ్యంగా పలకరిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలు పొలాల్లో ఉంటే నేరుగా వారి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, అదే సమయంలో వారిని చైతన్యం చేస్తున్నారు. వివిధ వర్గాల సమస్యలపై తన వైఖరిని వెల్లడిస్తున్నారు. అధికారంలోకి వస్తే తమపార్టీ ఏమి చేస్తుందో వారికి వివరిస్తున్నారు. ఆయనను చూడడానికి వచ్చిన మహిళలను పేరు పేరునా పలకరిస్తూ, అక్కా అంటూ వారిలో కలిసిపోతున్నారు. పక్కఇంటి కుర్రాడిలా వారిలో కలిసిపోతున్నారు. అక్కా, అమ్మా, పిన్నీ, పెద్దమ్మా అంటూ వారిని వరసలు పెట్టి పలకరిస్తున్నారు. తొలి రోజు కన్నా మలిరోజు ఆయన ప్రజలతో మమేకం కావడానికి, తాను వారిలో ఒక్కడిని అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. తన తల్లిని అవమానించిన వారిని వదిలేది లేదని, మహిళలకు తాము ఎంత గౌరవాన్ని ఇస్తామో..వారిని ఎలా కాపాడుకుంటామో చెప్పడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. మొత్తం మీద రెండోరోజు ఆయన ప్రజల్లో కలవడానికి, వారితో మాట్లాడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ