లేటెస్ట్

ఘోరంగా పడిపోయిన ‘జగన్‌’ గ్రాఫ్‌: ఇండియాటుడే సర్వే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో పలుకుబడి ఘోరంగా తగ్గిపోయిందని, దాదాపు నాలుగేళ్ల ఆయన పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని, ఆయన గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయిందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఇండియా టుడే’ తన సర్వేలో వెల్లడిరచింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ‘జగన్‌’ తరువాత ప్రజలను ఆకట్టుకోలేకపోయారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దిగజారిందని, ‘ఇండియాటుడే`సి ఓటర్‌’ సర్వేలో తేలింది. మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరిట ‘ఇండియా టుడే సర్వే నిర్వహిస్తుంటుంది. 2022 ఆగస్టులో చేసిన మూడ్‌ ఆఫ్‌ ది సర్వేలో ‘జగన్‌’కు 56.5శాతం రేటింగ్‌ వచ్చింది. అయితే ఇప్పుడు అది కేవలం 39.7శాతానికి పడిపోయింది. ఆగస్టు నుంచి జనవరి అంటే కేవలం నాలుగు నెలల్లో దాదాపు 17శాతం రేటింగ్‌ను ఆయన కోల్పోయారు. ఇంత తక్కువ సమయంలో ‘జగన్‌’ గ్రాఫ్‌ ఇంత ఘోరంగా పడిపోవడం వెనుక పాలనావైఫల్యాలు, అవినీతి, అరాచకం, ఆశ్రితపక్షపాతం, అక్రమాలే కారణమనే భావన వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్న పార్టీలు, ముఖ్యమంత్రులపై ప్రజల నుంచి సహజంగానే వ్యతిరేకత వస్తుంది. దాదాపు నాలుగేళ్లు సిఎంగా ఉంటోన్న ‘జగన్‌’పై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం విశేషం. అధికారంలోకి రాకముందు ఒకరకంగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరో రకంగా ప్రవర్తించడమే..‘జగన్‌’ షార్ట్‌ పాల్‌కు కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని, అంతే కాకుండా మూడు రాజధానులంటూ ప్రజలను గందరగోళానికి గురి చేయడం, ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి కేంద్ర పెద్దలను నిలదీయలేకపోవడం, వారికి సాష్టాంగప్రమాణాలు చేస్తుండడంతో ప్రజలకు ఆయన నిజస్వరూపం తెలిసిపోయింది. దీంతో ఒక్కసారి అని అవకాశం ఇస్తే అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో ఇన్నాళ్లూ మాట్లాడకున్న వర్గాలు ఇప్పుడో నోరెత్తుతున్నాయి. దాని ఫలితమే..ఈ సర్వే ఫలితాలనే భావన వ్యక్తం అవుతోంది. కాగా దేశంలో అత్యంత ప్రజాధరణ ఉన్న ముఖ్యమంత్రి సర్వేలో ‘జగన్‌’కు పదోస్థానం లభించింది. మొత్తం మీద 175/175 గెలుస్తామని చెబుతోన్న ‘జగన్‌’కు తాజాగా వచ్చిన ‘ఇండియాటుడే’ సర్వే షాక్‌ ఇచ్చింది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ